- భారతీయుల అరెస్ట్పై కెనడా ప్రధాని ట్రుడో
టొరంటో : తమ దేశంలో చట్టబద్ధమైన పాలన, బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని, దేశ పౌరులను రక్షించడం తమ ప్రాథమిక విధి అని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో సంబంధముందని ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సిఎంపి) పేర్కొన్నట్లుగా దర్యాప్తు కొనసాగుతోందని ట్రూడో పేర్కొన్నారు. నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో సిక్కు సమాజంలో చాలా మంది అసురక్షితంగా భావిస్తున్నారని తెలిపారు. దేశంలోని ప్రతి కెనడియన్కు వివక్ష, హింస, బెదిరింపులు లేకుండా సురక్షితంగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొన్నారు. శనివారం అరెస్టయిన ముగ్గురు వ్యక్తులకే పరిమితం కాకుండా ప్రత్యేకమైన దర్యాప్తు జరుగుతుందని ట్రూడో పేర్కొన్నట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (సిబిసి) స్పష్టం చేసింది.