కర్ణాటకలో  పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Dec 1,2023 11:42 #Bengaluru, #Bomb Threat, #schools

 బెంగళూరు :   కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సుమారు 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్‌ నుండి ఈ బెదిరింపులు వచ్చాయని అన్నారు. పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఈ మెయిల్‌ పేర్కొంది. దీంతో పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వైట్‌ ఫీల్డ్‌, కోరమంగళ, బసవేశ్‌ నగర్‌, యలహంక, సదాశివనగర్‌తో పాటు బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు బాంబ్‌ స్క్వాడ్‌ను పంపినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు.

➡️