ఛత్తీస్‌గడ్‌లో ఘోరప్రమాదం – 9మంది మృతి

రాయపుర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగి 9మంది మృతి చెందారు. బెమెతరా జిల్లాలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని, మినీ వ్యాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9మంది మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారందరినీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️