రాజస్థాన్: రాజస్థాన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం వ్యాను మధ్యప్రదేశ్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఝలావర్ రహదారిపై ట్రక్కును ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా మరికొందరికి గాయాలు అయ్యాయని ఝలావర్ జిల్లా ఎస్పీ రిచాతోమర్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను అక్లెరా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.