దేశ రాజధానిలో మారిన వాతావరణం

May 11,2024 10:15 #atmosphere, #changed, #national capital

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు బలంగా చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. చాలాచోట్ల చెట్లు నేలకూలడంతోపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్‌ 58లో ఒక భవనం మరమ్మతు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్‌ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. శనివారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది.

➡️