- పలు విమానాలు ఆలస్యం..
ఢిల్లీ : ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టారు. దీంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపు 70 కి పైగా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ సిటీల మధ్య తిరగాల్సిన విమానలను రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. సిబ్బంది చివరినిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలుపడలేదని, అసౌకర్యానికి క్షమించాలని ఎయిర్ ఇండియా ప్రయాణికులను కోరింది. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుల వెనకున్న కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.