త్రిపురలో సిపిఎం ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

Mar 19,2024 00:27 #candidates, #CPM MP and MLA, #Tripura

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపుర తూర్పు (ఎస్‌టి రిజర్వుడ్‌) లోక్‌సభ నియోజకవర్గానికి, అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే రామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. తూర్పు త్రిపుర నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సిపిఎంకు చెందిన రాజేంద్ర రియాంగ్‌ బరిలోకి దిగనున్నారు. రామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా రతన్‌ దాస్‌ పోటీ చేయనున్నారు.

➡️