అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ (70) లక్నోలోని ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3:40 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం తదితర రైతు సంఘాలు సంతాపాన్ని తెలియజేశాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని లక్నోలో సిపిఐ కార్యాలయంలో ఉంచారు. అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు లక్నోలో జరగనున్నాయి. అతుల్‌ కుమార్‌ అంజన్‌ ప్రస్తుతం అఖిల భారత కిసాన్‌ సభ (అజరు భవన్‌) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

➡️