- మావోయిస్టుల దుశ్యర్య
బీజాపూర్ : ఛత్తీస్గఢ్లో కమాండర్ స్థాయి అధికారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సిఎఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్స్టేషన్ పరిధి అటవీప్రాంతంలోని సిఎఎఫ్ క్యాంప్నకు 200 మీటర్ల దూరంలో తన సిబ్బందితో కలిసి వంట చెరకు సేకరిస్తున్నారు. అప్పటికే అక్కడ కాపుగాసిన మావోయిస్టులు తిజౌరామ్ భూర్యను కిడ్నాప్ చేశారు. అనంతరం గొడ్డలితో దాడి చేసి, హత్య చేశారు. అక్కడినుంచి పరారయ్యారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన జవాన్లు అప్పటికే భూర్య మరణించినట్లు గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. భూర్య స్వగ్రామం నారాయణ్పూర్ జిల్లా భానుప్రతాపపురం అని తెలుస్తోంది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను భద్రతాదళాలు ముమ్మరం చేశాయి.