ప్రధాని మోడితో సిఎం జగన్‌ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడితో ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీలో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోడిని కలిసిన జగన్‌ సుమారు 25 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోడితో సిఎం చర్చించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

➡️