పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా

Apr 15,2024 00:39 #Congress, #jabitha

న్కూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 10 మందితో మరో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, కన్నయ్య కుమార్‌లకు చోటు దక్కింది. ఆదివారం రాత్రి ఎఐసిసి విడుదల చేసిన ఈ అభ్యర్థుల జాబితా ప్రకారం.. కాంగ్రెస్‌ నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను ఢిల్లీ నార్త్‌ ఈస్ట్‌ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బిజెపి సీనియర్‌ నాయకుడు మనోజ్‌ తివారీ బరిలో ఉన్నారు. అలాగే, చాందినీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జేపీ అగర్వాల్‌, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్‌ పోటీ చేయనున్నారు.
అలాగే, పంజాబ్‌లో అమృత్‌ సర్‌ నుంచి గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా పోటీ చేస్తుండగా.. జలంధర్‌ (ఎస్సీ) నుంచి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ఫతేగఢ్‌ సాహిబ్‌ (ఎస్సీ) నుంచి అమర్‌ సింగ్‌, భటిండా నుంచి జీత్‌ మొహిందర్‌ సింగ్‌ సిద్ధూ, సంగ్రూర్‌ నుంచి ఆల్‌ ఇండియా కిసాన్‌ విభాగం చీఫ్‌ సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా, పటియాలా నుంచి డా. ధరమ్‌వీర్‌ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నుంచి ఉజ్వల్‌ రేవతి రమన్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించింది. అలాగే ఈ జాబితాతో పాటు ఒడిషా అసెంబ్లీ ఎన్నికలకు 75మంది అభ్యర్థులతోనూ మరో జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది.

➡️