న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 761 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే ఈ వైరస్కు 12 మంది మృతి చెందారు. కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా, దేశవ్యాప్తంగా కేరళలో 1,249, కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్గఢ్ – ఆంధ్రప్రదేశ్ 128 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 5వ తేదీ కేరళలో కరోనా సబ్ వేరియంట్ జెఎన్.1 కేసు నమోదైంది. ఆ తర్వాత నుంచి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.