ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వెలుపల ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్కి తన అవసరం లేదని, అందుకే కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని.. అలాగని దూషిస్తూ వెళ్లిపోవడం తన నైజం కాదన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వినమ్రంగా పంపిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నిలువరించే ఉద్యమాల్లో కీలక పాత్రను పోషిస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సహా అందరి దఅష్టికి తీసుకువెళతానన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోందని, కుల జనగణన దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.