న్యూఢిల్లీ : బిజెపి కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పేదలు, దళితులు, ఎస్టి, బిసిలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని బిజెపి నాశనం చేయాలని చూస్తోందని అన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, బిసిలకు రాజ్యాంగం మహాత్మాగాంధీ ఉపాధి పథకం, భూ హక్కులు, రిజర్వేషన్లు సహా పలు హక్కులను కల్పించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం కానప్పుడు .. ప్రభుత్వ సంస్థలను, రైల్వేలు, ఇతర సంస్థలను ఎందుకు ప్రైవేట్పరం చేస్తోందని ప్రశ్నించారు.. ప్రధాని మోడీ కేవలం 22 నుంచి 25 మంది పారిశ్రామిక వేత్తలను బిలియనీర్లుగా మారిస్తే .. కాంగ్రెస్ కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేస్తుందని అన్నారు. భింద్ లోక్సభ (ఎస్సి-రిజర్వ్డ్) స్థానం నుండి బిజెపి సిట్టింగ్ ఎంపి సంధ్యా రారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్యను పోటీకి దింపింది.