కర్ణాటకలో ఘోరం.. బాలిక తల నరికి ఉరేసుకున్న వరుడు

May 11,2024 23:40 #crime, #Hatya, #Karnataka

కర్ణాటక : నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయి బాలిక కావడంతో ప్రభుత్వ అధికారులు నిశ్చితార్ధాన్ని అడ్డుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన వరుడు ఆమెను నరికి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (16)తో స్థానికుడైన ప్రకాశ్‌ (32)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తనకు పరిచయం ఉన్నవారి ద్వారా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించింది. వెంటనే బాలిక ఇంటికి చేరుకున్న అధికారులు నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.
దీంతో ప్రకాశ్‌ ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆపై మీనాను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తల నరికి హత్య చేశాడు. మొండాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను హత్యచేసిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రకాశ్‌ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️