మంబై: ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో రన్వేపై ప్రయాణికులు భోజనం చేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సీరియస్ అయ్యింది. దీంతో ఇండిగోకు రూ.1.2 కోట్ల జరిమానా విధించింది. ఎయిర్పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే.. ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీసీఏఎస్ చర్యలకు ఉపక్రమించింది.