తమిళనాడులో ఐటి-ఈడీ సోదాలు

Apr 9,2024 11:52 #IT-ED searches, #Tamil Nadu

తమిళనాడు : తమిళనాడులో పలువురు నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అధికార పార్టీ డిఎంకె కు చెందిన కొందరు నేతలతోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నులశాఖ దాడులు కొనసాగిస్తోంది.

చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తోంది. డిఎంకె బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్‌ సాదిక్‌కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డిఎంకె నేతలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శక నటుడు అమీర్‌ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు డిఎంకె ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సిబి నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్‌ఐఆర్‌లను పరిగణలోకి తీసుకుని సాదిక్‌, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా … మరోవైపు.. తమిళనాడులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్‌ పౌల్ట్రీ ఫామ్స్‌ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటి బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అరుల్‌మురుగన్‌, శరవణ మురుగన్‌, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

➡️