మార్చి 9 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

న్యూఢిల్లీ   :    2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 9 తర్వాత ప్రక టించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ మరియు మే నెలల్లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఇప్పటికే ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఇసిఐకి చెందిన అధికారుల బృందం వరుసగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి.  దీంతో మార్చి 8-9 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిస్సా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది.గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై అందులో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఇసి బఅందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. బలగాల లభ్యత ఆధారంగా ఎన్నికలపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. లోక్‌సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

➡️