ED summons : విచారణను దాటవేసిన మొయిత్రా

Mar 28,2024 12:20 #ED summons, #Mahua Moitra

కోల్‌కతా :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లను టిఎంసి నేత మహువా మొయిత్రా దాటవేశారు. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణానగర్‌ నియోజకవర్గంలో గురువారం చేపట్టనున్న ఎన్నికల ప్రదర్శనలో పాల్గొననున్నట్లు  మహువా మొయిత్రా మీడియాకు వెల్లడించారు.

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్‌ఇఎంఎ) ఉల్లంఘన కేసులో నేడు న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా మహువాతో పాటు దుబాయికి చెందిన వ్యాపారి దర్శన్‌ హీరానందానీలకు ఇడి బుధవారం సాయంత్రం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గతంలో ఇడి రెండు సార్లు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.అయితే అధికారిక విధులను ఉటంకిస్తూ.. నోటీసులను వాయిదా వేయాలని ఆమె కోరారు.

➡️