బార్పేట : సిపిఎం అభ్యర్థుల విజయంతోనే ప్రజల హక్కులకు రక్షణ సాధ్యమవుతుందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు. అస్సాంలోని బార్పేట లోక్సభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మనోరంజన్ తాలూక్దార్కు మద్దతుగా బంగైగావ్లోని మాణిక్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.