కొల్హాపూర్ : ఈ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ అదృశ్యమై పోతుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీలపై అక్కసు వెళ్లగక్కారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలనేవి అభివృద్ధి చెందిన భారత్ మిషన్కు సంబంధించినవని అన్నారు. ‘ఒక ఏడాదికి ఒక ప్రధాని’ అంటూ ప్రతిపక్ష బ్లాక్ పెట్టుకోబోయే ఫార్ములాను ఈ దేశ ప్రజలు సహించలేరని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, ఇండియా బ్లాక్లు సామాజిక న్యాయాన్ని హత్య చేసేందుకు కంకణం కట్టుకున్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. తమిళనాడులోని డిఎంకె సనాతన ధర్మంపై దాడి చేస్తుంటే వారిని మహారాష్ట్రకు ఆహ్వానించి గౌరవించారని మోడీ అన్నారు.