న్యూఢిల్లీ : ఏప్రిల్ 19న జరగబోయే లోక్సభ తొలిదశ ఎన్నికల అభ్యర్థుల్లో నకుల్నాథే అత్యంత ధనిక అభ్యర్థని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) వెల్లడించింది. సుమారు రూ.717 కోట్ల ఆస్తులున్న ఈయన మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్ కుమారుడు. ఈ జాబితాలో నకుల్ తర్వాత రూ.662 కోట్ల ఆస్తులతో తమిళనాడు ఎఐఎడిఎంకె అభ్యర్థి అశోక్ కుమార్ నిలిచారు. బిజెపి అభ్యర్థి టి. దేవనాథన్ యాదవ్కు రూ.304 కోట్ల ఆస్తులున్నాయని ఎడిఆర్ వెల్లడించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/45-1.jpg)