బారాముల్లా స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన ఒమర్‌ అబ్దుల్లా

May 3,2024 01:29 #2024 election, #nomination

శ్రీనగర్‌ : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ట్రెజరర్‌ షమ్మీ ఒబెరారు, జమ్మూకాశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జిఎన్‌ మోంగాతో కలిసి ఒమర్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. బారాముల్లా స్థానం నుంచి పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు సజాద్‌ లోన్‌తో ఒమర్‌ పోటీపడనున్నట్లు తెలుస్తోంది.
నాలుగు, ఐదు దశల్లో జరిగే పోలింగ్‌కి నామినేషన్‌కి మే 3 చివరితేది. ఒమర్‌ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌కి తిరిగి రాష్ట్ర హోదా దక్కేవరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి మళ్లీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం.

➡️