ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.19 తగ్గింది. దీంతో ఢిల్లీ రిటైల్ విక్రయాల్లో 19కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర నేటి నుండి రూ.1,745.50గా విక్రయించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాయి. ఇవాళ్టి నుంచే ఈ తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. అటు గఅహ అవసరాల నిమిత్తం వాడే సిలిండర్ ధరలు మాత్రం తగ్గలేదు.