మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

  • బాధ్యతలు అప్పగింతపై చర్చలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఈ సమావేశంలో ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అంతకముందు కాంగ్రెస్‌ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కూడా షర్మిల కలిశారు.

➡️