న్యూఢిల్లీ : అహ్మదాబాద్లోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపుల వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ బృందాలతో పాటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది.
అహ్మదాబాద్లోని కొన్ని పాఠశాలలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఆరు పాఠశాలలకు ఇటువంటి ఇమెయిల్స్ వచ్చాయని, ఢిల్లీలోని పాఠశాలలకు కొన్ని రోజుల క్రితం వచ్చిన బాంబు బెదిరింపుల తరహాలోనే ఇవి కూడా ఉన్నట్లు తెలుస్తోందని సైబర్ క్రైమ్ బ్రాంచ్ డిసిపి లవీనా సిన్హా పేర్కొన్నారు. ఈ ఇమెయిల్స్ భారతదేశం వెలుపల నుండి వచ్చాయని అన్నారు.
మే 1న ఢిల్లీ, నొయిడాల్లోని సుమారు 100 పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.