హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు

Apr 7,2024 10:43 #car accident, #madyapradesh, #train

మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బలంగా ఢీకొట్టింది. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఈ ఘటనలో పలు కోచ్‌లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని బినా ప్రాంతంలో పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన అధికారులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ..  రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు.

➡️