మరో ఇద్దరు ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు రాజీనామా

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీకి మరో ఇద్దరు సీనియర్‌ నేతలు బుధవారం రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే, వెస్ట్‌ ఢిల్లీ పార్లమెంటరీ సీటు పార్టీ పరిశీలకులు నీరజ్‌ బసోయా, మాజీ ఎమ్మెల్యే, నార్త్‌వెస్ట్‌ ఢిల్లీ పార్లమెంటరీ సీటు పార్టీ పరిశీలకులు నసీబ్‌ సింగ్‌లు పార్టీకి రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తు కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు వారిరువురు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీ కాంగ్రెస్‌ యూనిట్‌ చీఫ్‌ అరివింద్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అరవింద్‌ సింగ్‌ లవ్లీ రాజీనామాపై పార్టీ అధిష్టానంతో విభేదాల కారణంగానే ఈ ఇద్దరు నేతలు రాజీనామా చేసినట్లు సమాచారం.

➡️