న్యూఢిల్లీ : జేఎన్యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదా వేసింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం లంచ్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఈ కేసు విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. జనవరి 31కి జాబితా చేశామనీ, ఉన్నత ధర్మాసనం విచారణ చేపడుతుందని ధర్మానసం తెలిపింది. ఖలీద్ తరపున సీనియర్ న్యాయవాది సి.యు. సింగ్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే లంచ్ వరకు మాత్రమే ధర్మాసనం అందుబాటులో ఉండటంతో ఈ పిటిషన్ సహా ఉపా చట్టంలోని పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ అదే తేదీకి జాబితా చేసింది. బెయిల్ను తిరస్కరిస్తూ 2022 అక్టోబర్ 18న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఖలీద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ పిటిషన్ జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టాల్సి వుంది. అయితే గతేడాది ఆగస్ట్ 9న జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నారు.