జనం గొంతుక వెంకటేశన్‌

  • ఐదేళ్ల కృషితో ప్రజలకు చేరువ
  • యువత, సాహితీ వేత్తలతోప్రత్యేక అనుబంధం
  • కరోనా కాలంలో ప్రజల్లోనే ఉన్న నేతగా ముద్ర
  • మదురై సిపిఎం అభ్యర్థి

ప్రజాశక్తి -చెన్నై : తమిళనాడు, మదురై అభివృద్ధికి ఎంపిగా ఐదేళ్లపాటు చేసిన కషితో సిపిఎం మదురై లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత ఎంపి ఎస్‌. వెంకటేశన్‌ ప్రజలకు చేరువ అవుతున్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అయిన వెంకటేశన్‌ తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన వెంకటేశన్‌ మదురై ఎయిమ్స్‌ నిర్మాణంలో 95 శాతం పూర్తయిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలను పచ్చి అబద్ధమని బట్టబయలు చేశారు. నడ్డా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు మదురై ఎంపి వెంకటేశన్‌ ఎయిమ్స్‌ ప్రతిపాదిత ప్రాంతం తోపూర్‌ చేరుకున్నారు. ‘ఎయిమ్స్‌ ఎక్కడ ఉంది?’ అనే ప్లకార్డును పట్టుకుని నిరసన తెలిపారు. అక్కడ కనీసం ఒక్క భవనానికి కూడా పునాది వేయలేదు. ఈ అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ప్రయోజనాల కోసం చర్చలు జరుగుతున్నప్పుడు ఇలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జెపి నడ్డా చేసిన అబద్ధపు వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం అయింది.

జన వాణి
2019 నుంచి తమిళనాడు గొంతును పార్లమెంట్‌లో లేవనెత్తుతున్న ఎస్‌.వెంకటేశన్‌, లోక్‌సభకు మళ్లీ ఎన్నిక కావాలని మదురై ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపిగా ఐదేళ్లలో ఆయన నియోజకవర్గానికి చేసిన కార్యక్రమాలు, అభివద్ధి మళ్లీ ప్రజలకు చేరువ చేస్తున్నారు. 2023లో ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు అధికారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి తమిళనాడుకు కొత్త అనుభవాన్ని మిగిల్చింది. కోవిడ్‌ కాలంలో అన్ని ఇతర కార్యకలాపాల మధ్య, నియోజకవర్గ ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేయడానికి ఎంపి స్వయంగా రంగంలోకి దిగి ప్రజల్లో విశేష ఆదరణను పొందగలిగారు. హిందీని జొప్పించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతిఘటించారు. ఆలయాల నగరమైన మదురైకి వినూత్నమైన అభివద్ధి ప్రాజెక్టులను తీసుకురావడానికి, యువతకు మరిన్ని విద్యా, ఉపాధి అవకాశాలను అందించడానికి కషి చేశారు. ‘కవల్‌కోట’ రచయితను మధురై వాసులు ‘సన్‌ ఆఫ్‌ వైగా’ అని పిలుచుకుంటారు. మదురైకి, సంస్కతికి మూలమైన వైగా నదికి నమస్కరిస్తూ వెంకటేశన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన అభివద్ధి, పర్యావరణాన్ని మిళితం చేసే తమిళనాడు ముర్పోక్‌ ఎజుతలార్‌ సంఘానికి నాయకుడుగా ఉన్నారు. యువతతో సహా అన్ని వర్గాల ప్రజల నుంచి బలమైన మద్దతును చూరగొన్నారు.

సిపిఎంకు బలమైన కేంద్రం
మదురై లోక్‌సభ నియోజకవర్గం మదురై తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య, మేలూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది. సిపిఎంకు బలమైన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం 1999-2004లో సిపిఎం నుండి పి మోహన్‌ ఎంపిగా గెలిచారు. అంతకు ముందు 1967లో సిపిఎం సీనియర్‌ నేత పి.రామమూర్తి ఎంపిగా ఉన్నారు. 1957లో సిపిఐకి చెందిన కెటికె తంగమణి ఎంపిగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వెంకటేశన్‌ 44.20 శాతం ఓట్లతో అన్నాడిఎంకె అభ్యర్థి వివిఆర్‌ రాజ్‌ సత్యన్‌పై 1,34,119 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఎఐఎడిఎంకెకు చెందిన పి. శరవణన్‌, బిజెపికి చెందిన రామ శ్రీనివాసన్‌ ఆయన ప్రత్యర్థులు. సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ లో ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి.

ప్రజలతో మమేకం
వెంకటేశన్‌ తనదైన శైలిలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఆయన గెలుపు కోసం సిపిఎం నేతలు, కార్యకర్తలు, ఇండియా ఫోరం నేతలతో పాటు కవులు, రచయితలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ సినీ నటి రోహిణి రోజూ సిపిఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

➡️