అర్థరాత్రి వరకూ పని చేస్తున్నాం : పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం స్పందన

May 24,2024 00:35 #Supreme reaction

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అర్థరాత్రి వరకూ పనిచేసే వారిలో తాము ఉన్నామని తెలిపింది. ”న్యాయమూర్తులు కష్టపడి పనిచేసినా.. కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. నిర్ణీత గడువులోగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పిటిషన్‌ కూడా దాఖలవడం లేదు. ఆలస్యానికి క్షమించాలని కోరుతూ అన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. సెలవుల్లో కూడా అర్థరాత్రి పని చేసేవారిలో మేం ఉన్నాం’ అని వెకేషన్‌ బెంచ్‌కు నేతఅత్వం వహిస్తున్న జస్టిస్‌ దీపంకరదత్త చెప్పారు.
సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఈ పరిశీలనతో పూర్తిగా ఏకీభవించారు. సంజీవ్‌ సన్యాల్‌ విమర్శలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంజరు కిషన్‌ కౌల్‌ కూడా తీవ్రంగా స్పందించారు.

➡️