తమిళనాడులో ఏచూరి, రాజా విస్తృత ప్రచారం

చెన్నై : తమిళనాడులో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వామపక్ష అభ్యర్థుల, ఇండియా వేదిక అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి ఆర్‌.సచ్చితానందానికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు. ప్రతిపక్ష నేతలను బిజెపిలో చేర్చుకోవాలనే రహస్య అజెండాతో కేంద్ర ఏజెన్సీలతో మోడీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని విమర్శించారు. వరద సహాయం అందించడం, తమిళనాడు అభివృద్ధికి నిధులు కేటాయించడంపై మాట్లాడకుండా తమిళనాడులో ప్రధాని పర్యటించడం వల్ల ఉపయోగమేమిటని ఆయన ప్రశ్నించారు.
మదురైలో సిపిఎం అభ్యర్థి సు వెంకటేశన్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెక్యులర్‌ ప్రోగ్రసివ్‌ అలయన్స్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️