విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణను పోరాటాలతో అడ్డుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్ డి.ఆదినారాయణ, నాయకులు జె.రామకృష్ణ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1139వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగానికి చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ రంగ సంస్థలను అందించాలంటే ఇటువంటి పోరాటాలు అవసరమన్నారు. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరాటం తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.