హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది.