ఐక్య పోరాటాలతోనే విజయం- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 20,2024 23:30 #ukkunagaram, #visakha steel plant

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం): ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1133వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరంలో స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దే దింపి ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాలని కోరారు. ఈ రెండు నెలల్లో ఉక్కు పోరాటాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.

➡️