టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శుక్రవారం స్వామివారిని 63,831 మంది దర్శించుకోగా 25,367 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చిందన్నారు.

తిరుపతి కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామాక్షి సమేత సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై పురవీధుల్లో విహరించారు.

➡️