తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వివరించారు. బుధవారం స్వామివారిని 67,275 మంది యాత్రికులు దర్శించుకోగా 25,293 మంది తలనీలాలు సమర్పించారు . యాత్రికులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు వచ్చిందని తెలిపారు.

➡️