తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు యాత్రికులు 12 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం స్వామివారిని 70,077 మంది యాత్రికులు దర్శించుకోగా 24,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

➡️