తిరుమలలో స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 57,880 మంది యాత్రికులు దర్శించుకోగా 19,772 మంది దర్శించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందన్నారు.

తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి యాత్రికులకు దర్శనమిచ్చారు. వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజి రంగచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️