సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఇరిగేషన్ డిపార్టమెంటు స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. అక్కడి కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. పర్యాటక, సంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్కు రెవెన్యూ (ఎండోమెంట్) ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హౌదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేశారు. మొత్తం ఐదుగురు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది.