నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి ఏపీకి నీటి విడుదల

Mar 1,2024 21:33 #Nagarjuna Sagar, #water release

అమరావతి : ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 1 న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ నీటి వాటా కింద నీటిని విడుదల చేశారు.

ఈ మేరకు కృష్ణా బోర్డు చెందిన అధికారులు సాగర్‌ కుడి కాలువ హెడ్‌రెగ్యులేడర్‌ నుంచి రెండు రాష్ట్రాల ఇంజినీర్ల సమక్షంలో విడుదల ప్రారంభించారు. రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3 టీఎంసీల నీటిని 9 రోజుల పాటు విడుదల చేయనున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో తాగునీటి అవసరాలకు నీటిని వినియోగించనున్నారు.

➡️