ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

  • విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు

చింతకాని: ఖమ్మం – విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్‌ రైలును నిలిపివేశాడు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

➡️