హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది. ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించామని తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమంగా చెప్పారు. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే అని అన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారం : సిఎం రేవంత్ రెడ్డి
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/cm-revanth-reddy.jpg)