హైదరాబాద్: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్లో ‘శారీ రన్’ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గన్నారు.నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. చీర సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ఇది సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. చీరలు మహిళలకు హుందాతనం, గౌరవాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/1-40.jpg)