విజయవాడ: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని.. మోసం చేసిన అధ్యాయమన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఇప్పటికైనా దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.