ప్రజాశక్తి-ఆగిరిపల్లి : ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి సమీపంలోని మామిడి తోటలో ముగ్గురు యువకులు డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. వేడుకలు ముగించుకుని ముగ్గురు ద్విచక్రవాహనంపై వస్తున్న కమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.