హైదరాబాద్ : బిగ్బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు… నగరంలోని సరూర్నగర్కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్గూడకు చెందిన సుధాకర్, పవన్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్బాస్ ఫైనల్స్ సమయంలో … అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటన కేసులో అరెస్టయిన పల్లవి ప్రశాంత్కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ ఠాణాకు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు కూడా బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/biggboss-1.jpg)