మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Feb 17,2024 16:15 #medaram jathara, #special trains

తెలంగాణ: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు యాత్రికుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-వరంగల్‌, నిజామాబాద్‌-వరంగల్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-వరంగల్‌ మార్గంలో నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్‌, కామారెడ్డి, మనోహరాబాద్‌, మేడ్చల్‌, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఉపయోగపడనున్నాయి.సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-వరంగల్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (07017/07018), సికింద్రాబాద్‌-వరంగల్‌-సికింద్రాబాద్‌ మధ్య (07014/07015) నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌ (7019/07020) రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రభుత్వం, గిరిజన సంస్కఅతి, సంప్రదాయాలు, గిరిజన సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్ల కోసం రూ.3కోట్లను కేటాయించిందని వివరించారు.

➡️