సంక్రాంతికి 32 స్పెషల్‌ ట్రైన్స్‌

Jan 2,2024 18:50 #sankaranthi, #special trains

సికింద్రాబాద్‌: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-బ్రహ్మపుర్‌, బ్రహ్మపుర్‌-వికారాబాద్‌, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

➡️