ప్రజాశక్తి – ఏలూరు జిల్లా యంత్రాంగం : వైసిపి తలపెట్టిన ‘సిద్ధం’ సభను అడ్డుకుంటారనే పేరుతో ఏలూరు జిల్లా పోలీసులు సిపిఎం, సిఐటియు, ప్రజాసంఘాల నేతలను నిర్బంధించారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, నగర కార్యదర్శి పి.కిషోర్లను ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి.ప్రసాద్ను సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.నరసింహను నూజివీడు మండలం గొల్లపల్లిలో గృహనిర్బంధంలోఉంచారు. పలువురు నేతలకు నోటీసులు ఇవ్వడం, ఫోన్లు చేసి హెచ్చరించడం వంటి చర్యలు చేపట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం వారి పిరికితనానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించే నాయకులను నిర్బంధించడం మాని, ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దెందులూరులో సిఎం సభ నేపథ్యంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్యాదవ్ను దెందులూరు పోలీసులు గృహనిర్బంధం చేశారు.